*నెత్తుటి తిలకం దిద్దుకున్న కొడవలి నేను

Wednesday, 11 January 2012

నేడు, రేపు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు

హైదరాబాద్, జనవరి 10 : సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు బుధ, గురువారాల్లో జరగనున్నాయి. ఖమ్మంలో ఫి బ్రవరి 2, 3, 4 తేదీల్లో ఆ పార్టీ రాష్ట్ర మహాసభలు జరగనున్నందున ఈ సమావేశాలు కీలకం కానున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ కూడా వస్తున్నారు. ప్రధానంగా పార్టీ జాతీయ మహాసభలో ప్రవేశపెట్టనున్న రాజకీయ తీర్మానం ముసాయిదా ను ఈ సమావేశంలో సమర్పిస్తారు.

కాగా.. ఖమ్మంలో జరగనున్న రాష్ట్ర మహాసభల్లో కొత్త కార్యదర్శి ఎంపిక ప్రక్రియ ఉన్న నేపథ్యంలో ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న రాఘవులు మూడు దఫాలు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. మూడు సార్లకు మించి కార్యదర్శిగా పనిచేయకూడదనే నిబంధన ఇంకా అమల్లోకి రానందున ఆయనకు మరో దఫా అవకాశం ఉంది. సీఐటీయూకు రాష్ట్ర అధ్యక్షునిగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా ఉన్న ఎస్. వీరయ్యను పార్టీకి కొత్త రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేయనున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

No comments:

Post a Comment